పొలంలో ఒంటరిగా కనబడిన బాలికపై ఘోరం.. బతిమాలినా వినకుండా అత్యాచారం.. విషయం తండ్రికి తెలియడంతో..
ABN , First Publish Date - 2022-02-13T18:05:46+05:30 IST
పదిహేడేళ్ల బాలిక పొలంలో ఒంటరిగా పని చేసుకుంటోంది.. ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించిన ఓ యువకుడు తన శారీరక వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు..
పదిహేడేళ్ల బాలిక పొలంలో ఒంటరిగా పని చేసుకుంటోంది.. ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించిన ఓ యువకుడు తన శారీరక వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు.. ఆ బాలికను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఊరి నుంచి పరారయ్యాడు.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.. రాజస్థాన్లోని నాగౌర్లో ఈ ఘటన జరిగింది.
నాగౌర్కు సమీపంలోని ఖిన్స్వార్ గ్రామానికి చెందిన 17 బాలిక శనివారం ఉదయం తన పొలంలో పని చేసుకుంటోంది. అదే గ్రామానికి చెందిన అజయ్పాల్ అనే యువకుడు ఆ బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించాడు. ఆమె దగ్గరకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కణ్నుంచి పారిపోయాడు. బాలిక వెంటనే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాధిత బాలిక తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. అయితే నిందితుడు అప్పటికే పరారయ్యాడు. దీంతో కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకుని అజయ్ బంధువుల ఇళ్లన్నీ గాలించారు. చివరకు ఆదివారం సాయంత్రానికి నిందితుడిని అరెస్ట్ చేశారు.