1,150 గ్రాముల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-20T06:38:28+05:30 IST

ఇద్దరు గంజాయి విక్రయదారులను శనివారం ఈస్ట్‌ పోలీసులు అరెస్టు చేశారు.

1,150 గ్రాముల గంజాయి స్వాధీనం
పట్టుబడిన నిందితుడు, స్వాధీనం గంజాయితో పోలీసులు

ఇద్దరి అరెస్టు, నిందితుల్లో ఒకరు మైనర్‌


తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 19: ఇద్దరు గంజాయి విక్రయదారులను శనివారం ఈస్ట్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆదేశాల మేరకు మత్తుపదార్థాలపై పోలీసులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ప్రైవేటు బస్టాండు వద్ద గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సీఐ శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఐ నాగేంద్రబాబు విచారించి, వారి వద్ద నుంచి 1,150 గ్రాముల గంజాయిని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో.. దాసరిమఠానికి చెందిన ఆనంద్‌కుమార్‌(21), 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తులు, మత్తుపదార్థాల విక్రయాలపై ప్రజలు పోలీస్‌ వాట్సాప్‌ (80999 99977)కు, కంట్రోల్‌రూమ్‌ (63099 13960)కు సమాచారం ఇవ్వాలని సీఐ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-06-20T06:38:28+05:30 IST