80 లీటర్ల సారా స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-23T05:29:31+05:30 IST

మండలంలోని నర్సింగపల్లి సమీపంలో గురువారం 80 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ ఇన్‌చార్జి సీఐ కోట కృష్ణారావు తెలిపారు.

80 లీటర్ల సారా స్వాధీనం


టెక్కలి రూరల్‌: మండలంలోని నర్సింగపల్లి  సమీపంలో గురువారం 80 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ ఇన్‌చార్జి సీఐ కోట కృష్ణారావు తెలిపారు. నర్సింగపల్లి సమీపంలో పోలాకి మండ లంలోని గుప్పిడిపేటకు చెందిన చెక్క మల్లేసు, జలుమూరు మండలంలోని చిన్నివలసకు చెందిన కవిటి లక్ష్మణరావు రెండు ద్విచక్రవాహనాలపై  సారాను తరలిస్తున్నట్లు పట్టుబడ్డారని చెప్పారు. ఈ మేరకు వార్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. చెక్క భాస్కరరావు, అప్పలస్వామి పరారీలో ఉన్నారని,వారి ఆచూకీ కోసం పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. 

Updated Date - 2021-04-23T05:29:31+05:30 IST