దాచి ఉంచిన 812 కిలోల విత్తనాలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-24T04:59:32+05:30 IST

మండలంలోని డిధర్మారం గ్రామంలోని నాంపెల్లి అనే రైతు ఇంట్లో నిల్వ ఉన్న 812 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

దాచి ఉంచిన 812 కిలోల విత్తనాలు స్వాధీనం
విత్తనాలను పరిశీలిస్తున్న సీఐ నాగార్జునగౌడ్‌

రామాయంపేట/అల్లాదుర్గం, జూన్‌ 23 : మండలంలోని డిధర్మారం గ్రామంలోని నాంపెల్లి అనే రైతు ఇంట్లో నిల్వ ఉన్న 812 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ నాగార్జజనగౌడ్‌, వ్యవసాయశాఖ మండల అధికారి రాజనారాయణ నేతృత్వంలో డిధర్మాంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. అయితే నాంపెల్లి అనే రైతు ఇంట్లో సుమారు లక్షా 40 వేల విలువైన వరి, మొక్కజొన్న, ఆర్గానిక్‌ ఎరువులు, గుళికలు బయటపడ్డాయి. ఈ మేరకు అట్టి బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకుని సదరు రైతుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.  అల్లాదుర్గం మండలంలోని చిల్వర్‌ గ్రామంలో ఫర్టిలైజర్‌ దుకాణాలను ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, ఏవో నాగమణి తనిఖీ చేశారు.

Updated Date - 2021-06-24T04:59:32+05:30 IST