10టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2022-01-23T05:22:28+05:30 IST
10టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
శంషాబాద్, జనవరి 22: శంషాబాద్ ఆర్జీఐఏ పోలీ్సస్టేషన్ పరిధిలోని గగన్పహాడ్ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 10 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గగన్పహాడ్లోని ఓ గోదాంలో రేషన్బియ్యం అక్రమంగా నిల్వఉంచినట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు స్పెషల్బ్రాంచ్, ఆర్జీఐఏ పోలీసులు శనివారం సంయుక్తంగా దాడులు నిర్వహించి బియ్యాన్ని సీజ్ చేశారు. బియ్యంను నిల్వ ఉంచిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు.