38 రేషన బియ్యం బస్తాల పట్టివేత
ABN , First Publish Date - 2021-11-29T05:08:42+05:30 IST
మండలంలోని తిమ్మనాయునిపేట జంక్షన వద్ద ఆదివారం రెండు ఆటోలను తనిఖీ చేసి 38 రేషన బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకొని, ఇరువురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ హరినాథ్రెడ్డి ఆదివారం తెలిపారు.
కొలిమిగుండ్ల, నవంబరు 28: మండలంలోని తిమ్మనాయునిపేట జంక్షన వద్ద ఆదివారం రెండు ఆటోలను తనిఖీ చేసి 38 రేషన బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకొని, ఇరువురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ హరినాథ్రెడ్డి ఆదివారం తెలిపారు. తిమ్మనాయునిపేట జంక్షన వద్ద వాహనాల తనిఖీ చే స్తుండగా తనిఖీల్లో బనగానపల్లె మండలంలోని ఇల్లూరుకొత్తపేటకు చెందిన చింతకుంట చిన్నపుల్లయ్య తన ఆటోలో 20 బియ్యం బస్తాలు, ఆత్మకూరు మండలం ఏకలవ్యనగర్కు చెందిన కోనేటి గోపాల్ అనే వ్యక్తి ఆటోలో 18 రేషన బియ్యం తరలిస్తున్నారన్నారు. ఇద్దరు వ్యక్తులు ఆటోల్లో బియ్యాన్ని కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన బొరుగుల బట్టి ఓబుళరెడ్డికి విక్రయించడానికి తీసుకెళుతుండడంతో రెండు ఆటోలు, 38 బియ్యం బస్తాలు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.