బిల్లులేని డీజల్ ట్యాంకర్ స్వాధీనం
ABN , First Publish Date - 2021-11-27T06:38:33+05:30 IST
బిల్లు లేని ఓ డీజల్ ట్యాంకర్ను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్వాఽధీనం చేసుకున్నారు.
చిత్తూరు రూరల్, నవంబరు 26: బిల్లు లేని ఓ డీజల్ ట్యాంకర్ను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్వాఽధీనం చేసుకున్నారు. శుక్రవారం చిత్తూరు ఠానా వద్ద పొన్నై నుంచి చిత్తూరువైపుగా వస్తున్న డీజల్ ట్యాంకర్ను డీసీటీవో ఇందిర ప్రియదర్శిని ఆధ్వర్యంలో అధికారులు తనిఖీ చేశారు. రవాణాకు సంబంధించిన ఎటువంటి వే బిల్లు, ఇన్వాయి్స లేదని గుర్తించడంతోపాటు డ్రైవర్ పొంతనలేని సమాధానం చెప్పాడు. దాంతో జేసీ జాన్ స్టీవన్సన్ ఆదేశాల మేరకు ట్యాంకర్ను తవణంపల్లె పోలీసుస్టేషన్కు తరలించారు. ఇందులో దాదారు మూడు వేల లీటర్ల డీజల్ ఉంటుందని అధికారులు తెలిపారు. తమిళనాడులో డీజల్ ధరలు తక్కువగా ఉండటంతో అక్కడినుంచి తీసుకొచ్చి, మన రాష్ట్రంలో అమ్మకాలు సాగిస్తున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.