జీడిమెట్లలో డ్రగ్స్ పట్టివేత
ABN , First Publish Date - 2022-02-17T00:07:01+05:30 IST
నగరంలోని జీడిమెట్లలో నిషేధిత డ్రగ్స్ను పోలీసులు
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్లలో నిషేధిత డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన విశ్వసనీయమైన సమాచారంతో వాహనాల తనిఖీలను పోలీసులు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా రవాణా అవుతున్న కొకైన్ను పోలీసులు పట్టుకున్నారు. కొకైన్ను తరలిస్తున్న మాణిక్యం రావు, యాదగిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా, చెన్నై నుంచి కొకైన్ తీసుకొచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారు. నిందితులు నుంయి 12 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. దీనితో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు యుగేందర్, మల్లికార్జున్ గోవా నుంచి తెచ్చి నగరంలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.