రేషన్ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-02-11T01:40:08+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు

రేషన్ బియ్యం పట్టివేత

సంగారెడ్డి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని జహీరాబాద్ మీదుగా హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చిరాగ్ పల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బియ్యం విలువ ఆరు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-02-11T01:40:08+05:30 IST