ఎర్రచందనం దుంగలు స్వాధీనం - ఒకరి అరెస్టు

ABN , First Publish Date - 2022-01-22T04:50:24+05:30 IST

మండలంలోని ధేశెట్టిపల్లి బీట్‌ సెక్షన్‌ బాలపల్లి రెంజ్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం దాడులు నిర్వహించి 11 ఎర్రచందనం దుంగల ను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చెసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌.ఐ కృపానంద తెలిపారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం - ఒకరి అరెస్టు

రైల్వేకోడూరు రూరల్‌, జనవరి 21: మండలంలోని ధేశెట్టిపల్లి బీట్‌ సెక్షన్‌ బాలపల్లి రెంజ్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం దాడులు నిర్వహించి 11 ఎర్రచందనం దుంగల ను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చెసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌.ఐ కృపానంద తెలిపారు. వివరాల్లోకెళితే.... టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుందరరావు డీఎస్పీ డి.మురళీధర్‌ ఆదేశా ల మేరకు బాలపల్లి రెంజ్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కొందరిపై దాడి చేశామన్నారు. ఇందులో కోడూరు మండలం కె.బుడుగుంటపల్లికు చెందిన కొముద్దుల వెంకటసుబ్బయ్యను అరెస్టు చేసినట్లు తెలిపారు. పారిపోయిన స్మగ్లర్‌ కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడులో రైల్వేకోడూరు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T04:50:24+05:30 IST