ఎర్రచందనం దుంగల స్వాధీనం

ABN , First Publish Date - 2021-09-11T19:19:00+05:30 IST

కడప: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రైల్వేకోడూరు, సుండుపల్లె ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా దాడి చేసి

ఎర్రచందనం దుంగల స్వాధీనం

కడప:  జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రైల్వేకోడూరు, సుండుపల్లె ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. 62 ఎర్రచందనం దుంగలతో పాటు 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 8మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరికి తమిళనాడు కటిగేనహాలికి చెందిన పలు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-09-11T19:19:00+05:30 IST