కారులో తరలిస్తున్న రూ.6లక్షల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-02-28T05:12:57+05:30 IST
జిల్లాలోని తిరుమలగిరి పోలీ్సస్టేషన్ పరిధిలోని మామిడాల క్రాస్ రోడ్డు వద్ద రూ.6లక్షల విలువైన గంజాయిని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేట క్రైం / తిరుమలగిరి రూరల్, ఫిబ్రవరి 27: జిల్లాలోని తిరుమలగిరి పోలీ్సస్టేషన్ పరిధిలోని మామిడాల క్రాస్ రోడ్డు వద్ద రూ.6లక్షల విలువైన గంజాయిని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ మోహన్కుమార్ శనివారం వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుమలగిరి పోలీ్సస్టేషన్ పరిధిలోని మామిడాల క్రాస్ రోడ్డు వద్ద నాగారం సీఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం వాహనాల తనిఖీ నిర్వహించారు. అదే సమయంలో వరంగల్ జిల్లా కర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన ఎర్రమొగిళి అనే వ్యక్తి కారులో భద్రాచలం నుంచి సుమారు రూ.6లక్షల విలువ చేసే 129కిలోల గంజాయి ప్యాకెట్లను జహీరాబాద్కు తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో నాగారం సీఐ తుల శ్రీనివాస్, తుంగతుర్తి సీఐ రవి, తిరుమలగిరి ఎస్ఐ డానియేల్ పాల్గొన్నారు.