ఎన్ఎంఎంఎస్కు 15 మంది విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2021-06-17T04:39:00+05:30 IST
ఎన్ఎంఎంఎస్కు ఈదులవలస ఆదర్శ పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సి పాల్ పూడి ప్రవీణ బుధవారం తెలిపారు.
ఈదులవలస (పోలాకి) జూన్ 16: ఎన్ఎంఎంఎస్కు ఈదులవలస ఆదర్శ పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సి పాల్ పూడి ప్రవీణ బుధవారం తెలిపారు. కైబాడ రోహిత్, గొలివి ప్రేమ సాయి, పల్లి శరణ్య, సంపతిరావు వంశీ, గుంటముక్కల సురేంద్ర, మురకాడ మోహన్, కంచు స్పందన, చింతు ఢిలే ్లశ్వరి, శిమ్మ స్వాతి, వండాన లాస్య, చల్ల ధనుంజయ, చల్ల ఇందు, పల్లి హారిక, గొలివి స్వామి చరణ్, బొట్టా రేణుక ఎంపికయ్యారని పేర్కొని అభినందించారు.
దేవాడ నుంచి ప్రణీత్...
నందిగాం: దేవాడకి చెందిన గున్న ప్రణీత్ ఎన్ఎంఎంఎస్కు ఎంపికైనట్లు ఉపా ధ్యాయుడు రాంబాబు తెలిపారు. ప్రతిభ కనబరిచిన ప్రణీత్ను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
పలాసలో ఆరుగురు..
పలాస: పలాస ప్రభుత్వోన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కు ఎంపికయ్యారు. ఈ మేరకు విద్యార్థులకు పాఠశాల ఆవ రణలో బుధవారం హెచ్ఎం డి.తులసీరావు, ఉపాధ్యాయులు అభినం దించారు.