జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
ABN , First Publish Date - 2021-01-22T06:05:29+05:30 IST
స్త్రీ, పురుషుల జిల్లా కబడ్డీ జట్లకు క్రీడాకారుల ఎంపిక పోటీలను చౌడేపల్లె హైస్కూల్ మైదానంలో నిర్వహించినట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి పద్మావతి గురువారం తెలిపారు.
చౌడేపల్లె, జనవరి 21: స్త్రీ, పురుషుల జిల్లా కబడ్డీ జట్లకు క్రీడాకారుల ఎంపిక పోటీలను చౌడేపల్లె హైస్కూల్ మైదానంలో నిర్వహించినట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి పద్మావతి గురువారం తెలిపారు. పోటీల్లో జిల్లాలోని పలు మండలాలనుంచి 140 మంది స్త్రీ, పురుష క్రీడాకారులు పాల్గొన్నట్లు చెప్పారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీనివాసులు, చెన్నకేశవులు, హరీష్, వెంకటేష్, నవీన్, మహేష్, అరవింద్, శరత్, దినేష్, మహేష్, బాలాజి, ఆంజినేయులులను జిల్లా పురుషుల విభాగం జట్టుకు సంతో్షనాయక్, దీపక్, మాధవ, పునీత్లను అదనపు క్రీడాకారులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్త్రీలలో గుల్జార్, పవిత్ర, మునికుమారి, కావ్య, లతశ్రీ, స్వప్న, హర్షిత, నీలిమ, పూజిత, అనితలను స్త్రీవిభాగం జట్టుకు అలాగే పవిత్ర, సల్మా, దివ్యవాణిలను అదనపు ఆటగాళ్లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. పూర్వ విద్యార్థి పూల వేణు క్రీడాకారుల దుస్తుల కోసం రూ.10వేలు విరాళంగా ఇచ్చారని ఆమె చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎం ఈశ్వర్రెడ్డి, జిల్లా కబడ్డీ కోచ్ బాలాజి, పీడీలు రామచంద్ర, వెంకటేశ్వర్లు, పీఈటీ రాజేంద్ర, మల్లిరెడ్డి, బాబు, కుమార్ , దొరస్వామి తదితరులు పాల్గొన్నారు.