జిల్లా సబ్‌ జూనియర్‌ కబడ్డీ జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-12-07T06:38:06+05:30 IST

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌లో ఈ నెల 17 నుంచి జరిగే 31వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల కబడ్డీ పోటీలలో పాల్గొనే జిల్లా జట్లను సోమవారం ఎంపిక చేశారు.

జిల్లా సబ్‌ జూనియర్‌ కబడ్డీ జట్ల ఎంపిక
జిల్లా జట్టుకి ఎంపికైన క్రీడాకారులతో అసోసియేషన్‌ సభ్యులు

అక్కిరెడ్డిపాలెం, డిసెంబరు 6: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌లో ఈ నెల 17 నుంచి జరిగే 31వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల కబడ్డీ పోటీలలో పాల్గొనే జిల్లా జట్లను సోమవారం ఎంపిక చేశారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాజువాక హైస్కూల్‌ ప్రాంగణంలో జరిగిన ఈ ఎంపిక పోటీలలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 250 మంది బాలురు, 128 మంది బాలికలు పాల్గొన్నారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి ఉరుకూటి శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన ఈ ఎంపిక పోటీలలో బాలుర విభాగంలో 28 మందిని, బాలికల విభాగంలో 21 మందిని ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 16 వరకు శిక్షణనిచ్చి తుది జట్లను ఎంపిక చేయనున్నామని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రదాన కార్యదర్శి ఉరుకూటి రాజేశ్వరి తెలిపారు. ఈ ఎంపిక పోటీలను జాతీయ కోచ్‌ ఎం.ఉమా శంకర్‌బాబు, జాతీయ క్రీడాకారులు పి.అప్పారావు.  ఎం గణపతిరావు,ఎం.నరసింగరావు, పి.శ్రీనివాసరావు, వి.నిరుపమ, వై.యామిని, జి.శివ తదితరులు పర్యవేక్షించారు.


Updated Date - 2021-12-07T06:38:06+05:30 IST