ముగిసిన మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2021-07-25T05:58:20+05:30 IST
జిల్లాలోని మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశానికి ఈనెల 19న ప్రారంభమైన డిప్ ప్రక్రియ శనివారంతో ముగిసింది
చిత్తూరు (సెంట్రల్), జూలై 24 : జిల్లాలోని మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశానికి ఈనెల 19న ప్రారంభమైన డిప్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 19 మోడల్ స్కూళ్లకు 2375 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, డిప్ ద్వారా 1520 మందిని ఎంపిక చేశారు. చివరి రోజున ఎర్రావారిపాళ్యం, రొంపిచెర్ల, రామకుప్పం, పుంగనూరు మండలాల్లోని మోడల్స్కూళ్ళకు విద్యార్థుల ఎంపిక చేశారు. డీఈవో పురుషోత్తం, మోడల్స్కూల్ ఏడీ నాగరాజు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.
26లోగా అభ్యంతరాలు తెలపండి : డీఈవో
జిల్లాలో డీఎస్సీల వారిగా పీఈటీల సీనియారిటీ జాబితాలోని అభ్యంతరాలను సంబంధిత పాఠశాల హెచ్ఎంల ద్వారా ఈనెల 26వ తేదీలోపు తెలియజేయాలని డీఈవో పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. డీఎస్సీల వారిగా ప్రకటించిన స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాబితాలోని అభ్యంతరాలను ఈనెల 27తేదీలోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని డీఈవో ఆ ప్రకటనలో తెలిపారు.