ప్రశాంతంగా మునిసిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

ABN , First Publish Date - 2020-08-08T10:15:19+05:30 IST

దేవరకొండ మునిసిపాలిటీ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు టీఆర్‌ఎ్‌సకు చెందిన జింకల

ప్రశాంతంగా మునిసిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

దేవరకొండ, ఆగస్టు 7 : దేవరకొండ మునిసిపాలిటీ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు టీఆర్‌ఎ్‌సకు చెందిన జింకల లింగయ్య, సయ్యద్‌ఫాతిమా, పున్న అనురాధ, దేవతల శ్యాంసన్‌ కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికైనట్లు మునిసిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌రావు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన కోఆప్షన్‌ సభ్యులను ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కొత్త మునిసిపాలిటీ చట్టంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పల్లెలతో పాటు పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ రహత్‌అలీ, కౌన్సిలర్లు హనుమంతు వెంకటే్‌షగౌడ్‌, దేవేందర్‌నాయక్‌, అంజిగౌడ్‌, రైసుద్దీన్‌, మురళి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T10:15:19+05:30 IST