రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
ABN , First Publish Date - 2021-10-27T05:35:42+05:30 IST
రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు క్రీడాకారులు ఎంపికయ్యారు.
నంద్యాల(నూనెపల్లె), అక్టోబరు 26: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు క్రీడాకారులు ఎంపికయ్యారు. నంద్యాలలోని ప్రభుత్వ ఇండోర్ స్టేడియంలో అమెచ్యూర్ కుస్తీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కుస్తీ పోటీలు మంగళవారం జరిగాయి. పురుషులు, మహిళల విభాగం నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కుస్తీ క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 30వ తేదీ నుంచి విజయనగరంలో జరిగే రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి రాబర్ట్ తెలిపారు. ప్రీ స్టైల్ విభాగంలో రమేష్, వినోద్, సురేంద్ర, ఆనంద్, రాజశేఖర్, రూపేష్, సురే్షకుమార్, మనోహర్, కల్యాణ్ ఎంపికయ్యారన్నారు. గ్రీకు రోమన్ విభాగంలో హుసేన్బాషా, మహమ్మద్, యూసుఫ్, హేమంత్కుమార్, ఇమ్రాన్, సయ్యద్బాషా, అబ్దుల్ రసూల్, రోహిత్వర్మ, రామచంద్ర, మహబూబ్బాషా ఎంపికయ్యారని చెప్పారు. అలాగే మహిళా విభాగంలో కవిత, వెంకటనిర్మల, అంజు, మణి, శ్రీలక్ష్మి, చంద్రకళ ఎంపికయ్యారన్నారు.