టీడీపీ మండల కార్యవర్గం ఎంపిక
ABN , First Publish Date - 2020-11-30T04:55:19+05:30 IST
టీడీపీ మండల కార్యవర్గాన్ని ఆదివారం మాజీ ఎమ్మె ల్యే కలమట వెంకటరమణ మూర్తి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
మెళియాపుట్టి: టీడీపీ మండల కార్యవర్గాన్ని ఆదివారం మాజీ ఎమ్మె ల్యే కలమట వెంకటరమణ మూర్తి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడిగా భాస్కర్గౌడో, ఉపాధ్యక్షుడిగా ఇప్పిలి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శిగా ఉర్లాన వసంతరావు ఎన్నికయ్యారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా బూర్లె లలితకుమారి, ఉపాధ్యక్షురాలిగా హెచ్.హేమలత, తెలుగు యువత అధ్యక్షుడిగా శ్రీరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా బసవ పరమేష్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడిగా హెచ్. చంద్రశేఖర్లను ఎంపిక చేశా రు. తెలుగు రైతు అధ్యక్షుడిగా ఎస్.వెంకట్రావ్, మీడియా విభాగం నుంచి చక్రిలను నియమించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సాగర్బాబు, మాజీ ఎంపీపీ సలాన మోహనరావు తదితరులు పాల్గొన్నారు.