వాలీబాల్‌ జిల్లా బాల, బాలికల జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-12-06T05:36:11+05:30 IST

వాలీబాల్‌ జిల్లా అండర్‌-15 బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలను ఆదివారం బంగారుపాళ్యం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో నిర్వహించారు.

వాలీబాల్‌ జిల్లా బాల, బాలికల జట్ల ఎంపిక
జిల్లా జట్లకు ఎంపికైన బాలికలు

బంగారుపాళ్యం, డిసెంబరు 5:  వాలీబాల్‌ జిల్లా అండర్‌-15 బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలను ఆదివారం బంగారుపాళ్యం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలు జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి క్రిష్ణారెడ్డి, మాజీ జిల్లా వాలీబాల్‌ కోచ్‌ సుదర్శన్‌ నాయుడు, జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ కోశాధికారి మురారి, మాజీ జాతీయ వాలీబాల్‌ క్రీడాకారుడు కుమార్‌రాజా ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి బాల,బాలికలు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. అండర్‌- 15 బాలికల జట్టుకు... భావన, సుమతి, సుమాంజలి (పుంగనూరు), రేవతి, స్ఫూర్తి, పల్లవి  (బంగారుపాళ్యం), మాలిని, బిందు, జాహ్నవి (రామసముద్రం), గోమతి, వినూత, హర్షిణి (తిరుపతి), కావ్య (ఎస్వీనగర్‌), సంతిజ, తనుజ లక్ష్మి (నరసింగాపురం), వెన్నెల (మత్యం), లావణ్య (మొగిలి) ఎంపికయ్యారు. అదేవిధంగా అండర్‌ -15 బాలుర జట్టుకు.. వెంకటేష్‌ (బి.కొత్తకోట), సాయి కుమార్‌ (గంగవరం), గుణశేఖర్‌, రెడ్డిభార్గవ్‌(పుంగనూరు), మనోజ్‌ వర్మ (నిండ్ర), యహజాజ్‌ (తిరుపతి), మొహమ్మద్‌ జున్నీద్‌ (బంగారుపాళ్యం), లక్ష్మీప్రసాద్‌, కుబేంద్ర (కుప్పం), సాహిద్‌ (రొంపిచెర్ల), సాయి కుమార్‌ (రామసముద్రం), మహేంద్ర (ఎర్రావారిపల్లె) ఎంపికైనట్లు జిల్లా కార్యదర్శి క్రిష్ణారెడ్డి తెలిపారు. వీరు ఈనెల 11వ తేదీన అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో చిత్తూరు జిల్లా జట్లకు ప్రాతినిఽథ్యం వహిస్తారు.



Updated Date - 2021-12-06T05:36:11+05:30 IST