సెల్ఫీకి ప్రయత్నించిన ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-11-14T17:04:47+05:30 IST

స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సెల్ఫీలు తీసుకోవడం మరింత పెరిగింది. నగరంలోని ఫ్లైఓవర్‌పై సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తుండగా పాల వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు

సెల్ఫీకి ప్రయత్నించిన ఇద్దరు మృతి

బెంగళూరు(Karnataka): స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సెల్ఫీలు తీసుకోవడం మరింత పెరిగింది. నగరంలోని ఫ్లైఓవర్‌పై సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తుండగా పాల వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. వైట్‌ఫీల్డ్‌కు చెందిన దినేశ్‌ (25), వినయ్‌ (25) శుక్రవారం రాత్రి స్నేహితులతో కలసి కారులో వెళ్లారు. తావరకెరె ఫ్లై ఓవర్‌పై కారు నిలిపి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఈలోపు వెనుక నుంచి వచ్చిన పాలవ్యాను ఢీకొనడంతో తీవ్రగాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో అంకిత్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడినవారిని ఎంవీజే ఆసుపత్రికి తరలించారు. కాగా పాలవాహనాన్ని అక్కడే వదిలి డ్రైవర్‌ పరారయ్యాడు. సమాచారం అందుకున్న నందగుడి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-14T17:04:47+05:30 IST