దేశానికే ఆదర్శం అమ్మఒడి
ABN , First Publish Date - 2022-06-28T05:34:11+05:30 IST
అమ్మఒడి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమల శాఖా మంత్రి అమర్నాథ్ అన్నారు.
మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడఅమర్నాథ్
లబ్ధిదారులకు చెక్కు పంపిణీ
అనకాపల్లిఅర్బన్, జూన్ 27: అమ్మఒడి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమల శాఖా మంత్రి అమర్నాథ్ అన్నారు. సోమవారం వారు స్థానిక రావుగోపాలరావు స్టేడియంలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకం వల్ల లబ్ధి చేకూరిందన్నారు. 2022-23 సంవత్సరంలో రూ.8 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ అమ్మఒడి పథకంలో కోత విధిస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 75శాతం హాజరు శాతం ఉండాలని జీవోలోనే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి, డీఈవో లింగేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, కార్పొరేటర్లు నీలిమ, ప్రసన్నలక్ష్మి, మందపాటి సునీత, ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసీపీ నాయకులు మందపాటి జానకీరామరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రూ.238.158 కోట్లు చెక్కును లబ్ధిదారులకు అందజేశారు.