Rebel MLAలను Bengal పంపండి: Mamata Banerjee

ABN , First Publish Date - 2022-06-25T00:33:47+05:30 IST

మహారాష్ట్రకు చెందిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలను పశ్చిమ బెంగాల్‌కు పంపండని, వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ అన్నారు. అస్సాంలోని గువహాటిలో ఉన్న ఒక హోటల్‌లో సదరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం విడిది పొందుతున్న విషయం తెలిసిందే. అస్సాంలో ఒక వైపు వరదలు వస్తుంటే..

Rebel MLAలను Bengal పంపండి: Mamata Banerjee

కోల్‌కతా: మహారాష్ట్రకు చెందిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలను పశ్చిమ బెంగాల్‌కు పంపండని, వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ అన్నారు. అస్సాంలోని గువహాటిలో ఉన్న ఒక హోటల్‌లో సదరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం విడిది పొందుతున్న విషయం తెలిసిందే. అస్సాంలో ఒక వైపు వరదలు వస్తుంటే.. మహా ఎమ్మెల్యేలు ఇక్కడ విడిది పొందడమేంటని, సదరు ఎమ్మెల్యేలు ఉన్న రాడిసన్ బ్లు హోటల్ ముందు టీఎంసీ కార్యకర్తలు గురువారం నిరసన చేపట్టారు.


కాగా, శుక్రవారం ఈ విషయమై మమత స్పందిస్తూ ‘‘ప్రజాస్వామ్యంపై బీజేపీ బుల్డోజర్ ఎక్కుపెట్టింది. ఇది చాలా బాధకరమైంది. సమాఖ్య స్పూర్థిని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహారణ. అస్సాంలో వరదలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కానీ అస్సాం ముఖ్యమంత్రికి ఇవేవీ పట్టినట్టు లేదు. ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు రెబెల్ ఎమ్మెల్యేలకు విడిది పనులు చూసుకోవడంలో ఆయన బిజీగా ఉన్నారు’’ అని అన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘అస్సాంలో వాతావరణ పరిస్థితులు బాగాలేవు. మహా ఎమ్మెల్యేలను బెంగాల్ పంపండి. వారికి ఎలాంటి లోటు రాకుండా మేం చూసుకుంటాం’’ అని అన్నారు.

Updated Date - 2022-06-25T00:33:47+05:30 IST