సీనియర్లు వేధించేవారు!
ABN , First Publish Date - 2022-07-05T09:57:44+05:30 IST
తాను కూడా ర్యాగింగ్ బాధితురాలిననే సంచలన విషయాన్ని భారత టాప్ స్ర్పింటర్ ద్యూతీ చంద్ బయటపెట్టింది.
భువనేశ్వర్: తాను కూడా ర్యాగింగ్ బాధితురాలిననే సంచలన విషయాన్ని భారత టాప్ స్ర్పింటర్ ద్యూతీ చంద్ బయటపెట్టింది. 2006-08లో భువనేశ్వర్లోని స్పోర్ట్స్ హాస్టల్లో తాను ఎంతో మానసిక వ్యథను అనుభవించానని తెలిపింది. తాజాగా ఒడిశాలోని ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని ర్యాంగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకొంది. ఈ దుర్ఘటనపై ద్యూతీ స్పందించింది. ‘సీనియర్లు బాడీ మసాజ్ చేయాలని, దుస్తులు ఉతకాలని నన్ను వేధించేవార’ని చంద్ పేర్కొంది. తన పేదరికాన్ని కూడా అవహేళన చేసేవారని గుర్తు చేసుకొంది. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా తనలో తానే కుమిలిపోయే దాన్నని ద్యూతీ చెప్పింది.