నష్టపోయిన సెన్సెక్స్... అదేదారిలో నిఫ్టీ...

ABN , First Publish Date - 2021-03-04T23:04:30+05:30 IST

దూకుడు మీదున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్‌ దాదాపు 600 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ కీలకమైన 165 పాయింట్లను కోల్పోయింది.

నష్టపోయిన సెన్సెక్స్... అదేదారిలో నిఫ్టీ...

ముంబై : దూకుడు మీదున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్‌ దాదాపు 600 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ కీలకమైన 165 పాయింట్లను కోల్పోయింది. ఈ క్రమంలో...  నిఫ్టీ కీలకమైన ‘15 వేలు’ మైలురాయిని మరోసారి కోల్పోయింది. నిఫ్టీ బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మెటల్‌, ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. అయితే... ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడంతో కొంతమేర నిలదొక్కుకోగలగడం గమనార్హం. 


గురువారం ఉదయం 50,711 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌... రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో  దాదాపు 900 పాయింట్ల వరకు కోల్పోయిన సూచీ... మధ్యలో కాస్త కోలుకుని, చివరకు 598.57 పాయింట్ల నష్టంతో 50,846.08 వద్ద ముగిసింది. అటు, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ సైతం 164.80 పాయింట్ల నష్టంతో 15,080 వద్ద స్థిరపడింది.


నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ షేర్లు ప్రధానంగా నష్టాలను మూటగట్టుకున్నాయి. అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, శ్రీ సిమెంట్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం అమ్మకాల ఒత్తిడినెదుర్కొన్నాయి. ఇక... డాలరుతో రూపాయి మారకం విలువ 72.83 గా ఉంది.

Updated Date - 2021-03-04T23:04:30+05:30 IST