ఆరో రోజూ ఆగని పతనం
ABN , First Publish Date - 2022-05-14T08:27:34+05:30 IST
ఆరో రోజూ ఆగని పతనం
సెన్సెక్స్ 136 పాయింట్లు డౌన్
ముంబై : వరుసగా ఆరో రోజు కూడా ఈక్విటీ మార్కెట్ల పతనం ఆగలేదు. శుక్రవారం వారాంతపు రోజున సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్లో 800 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించినా ఆ లాభాలు నిలబెట్టుకోలేకపోయింది. చివరకు మరో 136.39 పాయింట్ల నష్టంతో 52793.62 వద్ద ముగిసింది. గత ఏడాది జూలై 30 తర్వాత సెన్సెక్స్ ఇంత కనిష్ఠ స్థాయిని నమోదు చేయడం ఇదే ప్రథమం. నిఫ్టీ మరో 25.85 పాయింట్లు నష్టపోయి 15782.15 వద్ద ముగిసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 2041.96 పాయింట్లు, నిఫ్టీ 629.10 పాయింట్లు నష్టపోయాయి.