భారీ లాభాల్లో ముగిసిన Stock markets
ABN , First Publish Date - 2022-05-27T21:22:04+05:30 IST
వరుసగా రెండవ సెషన్, వారాంతమైన శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Equity Markets) లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(Sensex) 632 పాయింట్లు లే
ముంబై : వరుసగా రెండవ సెషన్, వారాంతమైన శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Equity Markets) భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(Sensex) 632 పాయింట్లు లేదా 1.17 శాతం మేర లాభపడి 54,885 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ(Nifty50) 182 పాయింట్లు లేదా 1.13 శాతం వృద్ధి చెంది 16,352 పాయింట్ల వద్ద స్థిరపడింది. మిడ్, స్మాల్ షేర్లు కూడా చక్కటి లాభాలతో ముగిశాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 1.38 శాతం బలపడగా.. స్మాల్క్యాప్ 1.36 శాతం లాభపడింది. ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్స్ రంగాల షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆసక్తిచూపడం మార్కెట్లు దూసుకెళ్లేందుకు దోహపడింది. గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్ పాజిటివ్గా ఉండడం కూడా దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. కార్పొరేటు కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉంటాయనే విశ్వాసంతో యూఎస్ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో గ్లోబల్ మార్కెట్లకు సానుకూలమైంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.