నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ప్రస్తుతం 350 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్

ABN , First Publish Date - 2022-07-26T17:22:40+05:30 IST

ఇవాళ స్టాక్ మార్కెట్లు(Stock Markets) నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ(BSE), ఎన్ఎస్ఈ(NSE)లు 322 పాయింట్ల నష్టంతో 55,445 దగ్గర సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభమైంది.

నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ప్రస్తుతం 350 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్

Stock Market : ఇవాళ స్టాక్ మార్కెట్లు(Stock Markets) నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆ నష్టాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. బీఎస్ఈ(BSE), ఎన్ఎస్ఈ(NSE)లు 322 పాయింట్ల నష్టంతో 55,445 దగ్గర సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభమవగా.. 98 పాయింట్ల నష్టంతో 16,533 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 350 పాయింట్లు నష్టపోయి 55,400 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 16,500 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.8 శాతం నష్టపోయాయి.



సెన్సెక్స్ ప్యాక్‌లో, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్(Dr. Reddy’s Laboratories), నెస్లే ఇండియా(Nestle India), ఇన్ఫోసిస్(Infosys), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(HCL Technologies), కోటక్ మహీంద్రా బ్యాంక్(Kotak Mahindra Bank), లార్సెన్ అండ్ టూబ్రో (Larsen & Toubro), టెక్ మహీంద్రా(Tech Mahindra), ఏషియన్ పెయింట్స్(Asian Paints), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), యాక్సిస్ బ్యాంక్(Axis Bank) ప్రారంభంలోనే వెనుకబడి ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫిన్‌సర్వ్(Bajaj Finserv), టాటా స్టీల్(Tata Steel), అల్ట్రాటెక్ సిమెంట్(UltraTech Cement), బజాజ్ ఫైనాన్స్(Bajaj Finance), రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) లాభపడ్డాయి.


Updated Date - 2022-07-26T17:22:40+05:30 IST