రేపు సర్పంచ్ల అత్యవసర సమావేశం
ABN , First Publish Date - 2021-11-26T06:16:37+05:30 IST
గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లింపుపై శనివారం గుంటూరు అమరావతిరోడ్డులోని స్వగృహ ఫంక్షన్హాల్లో సర్పంచ్ల సమావేశం జరుగుతుందని జిల్లా సర్పంచ్లు తెలిపారు.
గుంటూరు(తూర్పు), నవంబరు 25: గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లింపుపై శనివారం గుంటూరు అమరావతిరోడ్డులోని స్వగృహ ఫంక్షన్హాల్లో సర్పంచ్ల సమావేశం జరుగుతుందని జిల్లా సర్పంచ్లు తెలిపారు. గురువారం స్థానిక ఓ హోటల్లో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధులు ఖాళీ అవ్వడంతో సర్పంచ్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు. దీంతో భవిష్యతు కార్యాచరణ చర్చించడానికి జరిగే సమావేశంలో సర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో పాల్గొనదలచిన వారు 99591 73999, 94907 94115, 779912 8882 నెంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు చిలకలపూడి పాపారావు, ముప్పాళ్ల మనోహర్, కృష్ణమోహన్, కే చిన్నా, పంచాయతీ పరిషత్ అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు పాల్గొన్నారు.