తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-05-14T06:01:57+05:30 IST

మండలంలోని గుచ్చిమి, జోగింపేట గ్రామా ల మధ్య శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కొడుకులకు తీవ్ర గాయాలు కాగా, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి.

తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు
గాయపడిన చిన్నారిని మోసుకెళ్తున్న ఎస్‌ఐ నీలకంఠం

 తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు
బెలగాం:
మండలంలోని గుచ్చిమి, జోగింపేట గ్రామా ల మధ్య శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కొడుకులకు తీవ్ర గాయాలు కాగా, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సాలూరు మండలం మావుడి గ్రామానికి చెందిన చెట్టిపల్లి అశోక్‌ తన భార్య చిన్న,  కొడుకు జోషఫ్‌ విజయ్‌కుమార్‌, కుమార్తె మేరీ ప్రియలతో సీతానగరం మండలం సూరంపేటలో తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి శుక్రవారం స్వగ్రామాని కి వస్తుండగా, బెలగాం మండలంలోని గుచ్చిమి, జోగింపే ట గ్రామాల మధ్య వీరి ద్విచక్ర వాహనం లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదం లో ఆరేళ్ల కుమారుడు జోషఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అశోక్‌కు ముఖమంతా చెక్కుకుపోయింది. మూడేళ్ల కుమా ర్తె మేరీప్రియకు నుదిటిపై స్వల్ప గాయమైంది.

క్షతగాత్రులకు పోలీసుల సాయం
 తమ కళ్ల ముందే జరిగిన ప్రమాదాన్ని చూసి సీతానగరం ఎస్‌ఐ నీలకంఠం హుటాహుటిన క్షతగాత్రులకు తన బృందంతో సపర్యలు అందించారు. అంతలోనే అటుగా వెళుతున్న పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తన వాహనాన్ని నిలి పి, క్షతగాత్రులను పోలీసు వాహనంలోనే జిల్లా కేంద్రాసు పత్రికి తరలించారు. ఎస్‌ఐ నీలకంఠం తన చేతులపైనే జోషఫ్‌ను ఆసుపత్రిలోకి తీసుకెళ్లి బెడ్డుపై వేశారు. బాలు డికి తగిలిన గాయాలను చూసి అంతా చలించిపోయా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి వైద్యులు క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

 
 

Read more