సర్పంచే ఆటో డ్రైవరై..

ABN , First Publish Date - 2021-04-22T10:14:48+05:30 IST

కరోనా సోకిన వారికి కుటుంబ సభ్యులే ఆమడ దూరం పెడుతున్న తరుణంలో ఓ సర్పంచ్‌ తన దయాగుణాన్ని చాటుకున్నారు. కరోనా సోకిన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు అందరూ జంకుతుంటే ఆయన మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి ఆమెను ఆస్పత్రిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

సర్పంచే ఆటో డ్రైవరై..

  • కరోనా రోగిని ఆస్పత్రికి తరలించిన దాతృత్వం


విజయవాడ రూరల్‌, ఏప్రిల్‌ 21: కరోనా సోకిన వారికి కుటుంబ సభ్యులే ఆమడ దూరం పెడుతున్న తరుణంలో ఓ సర్పంచ్‌ తన దయాగుణాన్ని చాటుకున్నారు. కరోనా సోకిన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు అందరూ జంకుతుంటే ఆయన మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి ఆమెను ఆస్పత్రిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. విజయవాడ రూరల్‌ మండలం అంబాపురానికి చెందిన గండికోట సీతయ్య.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ సర్పంచ్‌గా గెలుపొందారు. గ్రామానికి చెందిన ఒక మహిళకు (55) బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు గ్రామంలో ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న సీతయ్య పీపీఈ కిట్‌ ధరించి, ఆయనే స్వయంగా ఆటో నడుపుతూ ఆమెను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె తనను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కోరడంతో అదే ఆటోలో తీసుకెళ్లి ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లతో మాట్లాడి ఇంటికి చేరుకున్నారు. కరోనా కష్టకాలంలో బాధిత మహిళకు అండగా నిలిచిన సర్పంచ్‌ను అందరూ అభినందిస్తున్నారు. 

Updated Date - 2021-04-22T10:14:48+05:30 IST