సర్వర్‌ డౌన్‌.. అందని పెన్షన్‌ !

ABN , First Publish Date - 2022-08-10T10:16:47+05:30 IST

అసలే ఆలస్యం.. ఆపై సాంకేతిక లోపం.. దీంతో ఆసరా పింఛను సొమ్ము నేటికీ చేతికి రాక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అవస్థలు పడుతున్నారు.

సర్వర్‌ డౌన్‌.. అందని పెన్షన్‌ !

పలు జిల్లాల్లో ఫించనుదారుల అవస్థలు

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): అసలే ఆలస్యం.. ఆపై సాంకేతిక లోపం.. దీంతో ఆసరా పింఛను సొమ్ము నేటికీ చేతికి రాక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అవస్థలు పడుతున్నారు. జూన్‌ పింఛను జూలై 5న రావాల్సి ఉండగా చివరి వారంలో ప్రభుత్వం విడుదల చేసింది. ఈ తరుణంలో పలు జిల్లాల్లో బ్యాంకింగ్‌ కస్టమర్‌ సర్వీసు పాయింట్ల (సీఎ్‌సపీ)లో ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (ఏఈపీఎస్‌) సర్వర్‌ మొరాయిస్తుండటంతో ఆ లబిఽ్ధదారులు బ్యాంకు ఖాతాల నుంచి పింఛను సొమ్ము పొందలేకపోతున్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా చెల్లింపులు చేయగా, పట్టణ ప్రాంతాల్లోని వారికి ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఏటీఎం కార్డుల్లేని వారంతా సర్వర్‌ సమస్యతో సీఎ్‌సపీల చుట్టూ తిరుగుతూ వేసారిపోతున్నారు. కాగా, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, జనగాం, ఇతర జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే ఈ సమస్య తలెత్తిందని బ్యాంకింగ్‌ అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల సాంకేతిక లోపాన్ని సవరించారని మిగతా చోట్ల కూడా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2022-08-10T10:16:47+05:30 IST