వేంకటేశ్వరస్వామి సేవలో డాక్టర్ లక్ష్మణ్
ABN , First Publish Date - 2022-07-07T05:51:00+05:30 IST
వేంకటేశ్వరస్వామి సేవలో డాక్టర్ లక్ష్మణ్
కందుకూరు, జులై 6: గూడూరులోని వేంకటే శ్వరస్వామి దేవాలయాన్ని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ బుధవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దైవచింతనతో ముందుకు సాగాలన్నారు. అనంతరం లక్ష్మణ్ దంపతులను బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, మాజీ ఎంపీపీ అశోక్గౌడ్, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు సురసాని ఎల్లారెడ్డి, సర్పంచ్ శ్రీలతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎగ్గిడి సత్తయ్య, జైపాల్రెడ్డి, బలరాం, దార కుమార్, శ్రీనివా్సగౌడ్, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.