సేవా కార్యక్రమాలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-11-28T05:30:00+05:30 IST

కాకతీయ కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించి సంఘానికి గుర్తిం పు తేవాలని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర అన్నారు.

సేవా కార్యక్రమాలు నిర్వహించాలి
ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న డా.మన్నె, టీడీపీ నేతలు

కాకతీయ కమ్మ సేవా సంఘ వనభోజనాల్లో డాక్టర్‌ మన్నె పిలుపు 

ఎర్రగొండపాలెం, నవంబరు 28 : కాకతీయ కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించి సంఘానికి గుర్తిం పు తేవాలని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర అన్నారు. ఎ ర్రగొండపాలెంలో ఆదివారం నియోజకవర్గ  స్థాయి కార్తీక వన భోజన కా ర్రక్రమాలను  జ్యోతిప్రజ్వలనచేసి డాక్టరు రవీంద్ర ప్రారంభించారు. కార్తీక మాసంలో వనసమారాధన కార్యక్రమం నిర్వహించడంవలన  పాపకర్మ లు తొలగిపోతాయని అన్నారు.  మనపెద్దలను స్ఫూర్తిగా తీసుకొని కార్తీక మాసంలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన పెద్ద సంఖ్యలో పాల్గొని వన భోజ నాలు చేశారు.  కార్యక్రమంలో  ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, కమ్మ సేవా సంఘం పెద్దలు కామేపల్లి వెంకటేశ్వర్లు, చేకూరి సుబ్బారావు, కాకర్ల నరసింహారావు, వూట్ల సీతయ్య, వడ్లమూడి లింగయ్య, వేగినాటి శ్రీను,  చేకూరి నారాయణ, పుచ్చకాయల వెంకటేశ్వర్లు చౌదరి, కూచిపూడి కోటయ్య, సంఘ కమిటీ సభ్యులు కార్యక్రమం నిర్వహించారు.


Updated Date - 2021-11-28T05:30:00+05:30 IST