శంషాబాద్‌లో ఆన్‌లైన్‌ సర్వీసులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-26T05:21:17+05:30 IST

శంషాబాద్‌లో ఆన్‌లైన్‌ సర్వీసులు ప్రారంభం

శంషాబాద్‌లో ఆన్‌లైన్‌ సర్వీసులు ప్రారంభం
సర్వీసులను ప్రారంభిస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మామహేందర్‌రెడ్డి

శంషాబాద్‌,మే 25: శంషాబాద్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం ఆన్‌లైన్‌ సర్వీ్‌సలను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మా మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సర్వీసులను ఉపయోగించుకొని మున్సిపాలిటీలోని ప్రజలు ఆస్తిపన్ను, నీటి బిల్లులు సకాలంలో చెల్లించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వెబ్‌సెట్‌లో కొత్తగా పొందుపర్చిన సేవలను వినియోగించుకోవచ్చన్నారు. దీనికి సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌లను సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం, మండల పరిషత్‌ కార్యాలయం, తదితర కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Updated Date - 2022-05-26T05:21:17+05:30 IST