రాష్ట్ర శెట్టిబలిజ సాధికారిక కమిటీ సభ్యుడిగా శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2022-09-24T07:17:00+05:30 IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ విభాగంలో శెట్టిబలిజ సాధికారిక కమిటీ సభ్యుడిగా అప్పనపల్లి గ్రామానికి చెందిన మొల్లేటి శ్రీనివాస్‌(ఎంఎస్‌)ను రాష్ట్ర పార్టీ నియమించారు.

రాష్ట్ర శెట్టిబలిజ సాధికారిక కమిటీ సభ్యుడిగా శ్రీనివాస్‌

మామిడికుదురు, సెప్టెంబరు 23: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ విభాగంలో శెట్టిబలిజ సాధికారిక కమిటీ సభ్యుడిగా అప్పనపల్లి గ్రామానికి చెందిన మొల్లేటి శ్రీనివాస్‌(ఎంఎస్‌)ను రాష్ట్ర పార్టీ నియమించారు. ఆయన ప్రస్తుతం మామిడికుదురు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగాను, పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేషన్‌ సభ్యుడిగా పార్టీ లో విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సభ్యు డిగా 21న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు. తనకు పదవి కల్పించిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు, లోకేష్‌, అచ్చెన్నాయుడు, రెడ్డి సుబ్రహ్మణ్యం, కొల్లు రవీంద్రలకు శ్రీనివాస్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-09-24T07:17:00+05:30 IST