సెట్వెల్‌ సీఈవోగా మెహర్‌రాజ్‌ రేపు బాధ్యతలు

ABN , First Publish Date - 2021-06-23T05:59:23+05:30 IST

సెట్వెల్‌ సీఈవోగా ఎండీహెచ్‌ మెహర్‌రాజ్‌ నియమితులయ్యారు.

సెట్వెల్‌ సీఈవోగా మెహర్‌రాజ్‌ రేపు బాధ్యతలు
ఎండీహెచ్‌ మెహర్‌రాజ్‌

ఏలూరు రూరల్‌, జూన్‌ 22: సెట్వెల్‌ సీఈవోగా ఎండీహెచ్‌ మెహర్‌రాజ్‌ నియమితులయ్యారు. గతంలో ఆయన ఏలూరులోని సెట్వెల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం విజయవాడలోని ఏపీఎస్‌పీఈపీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. పదోన్నతుల్లో భాగంగా జిల్లా యువజన సేవల శాఖ(సెట్వెల్‌) సీఈవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారం బాధ్యతలు స్వీకరించనున్నట్టు ఆయన తెలిపారు. యువతను చైతన్యవంతం చేసే కార్యక్రమాలతో పాటు క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు, వారిలో ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు నిర్వహిస్తామని వివరించారు. 


Updated Date - 2021-06-23T05:59:23+05:30 IST