సేవ చేసే వారిని దైవ సమానంగా చూస్తారు
ABN , First Publish Date - 2021-03-01T07:05:33+05:30 IST
సేవ చేసే వారిని ప్రజలు దైవ సమానంగా చూస్తారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య అన్నారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
రాంగోపాల్పేట్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): సేవ చేసే వారిని ప్రజలు దైవ సమానంగా చూస్తారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య అన్నారు. ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్(ఈసీఐఎఫ్) అధ్వర్యంలో సికింద్రాబాద్ సన్షైన్ ఆస్పత్రిలో పోలీస్ అధికారులకు సేవా రత్న అవార్డుల ప్రదానం ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. దేశాన్ని త్రివిధ దళాలు రక్షిస్తే.. అంతర్గత భద్రతను కాపాడే వ్యవస్థ పోలీసు అని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా గుర్తు వచ్చేది పోలీసులేనని అన్నారు. సుమారు 70 మంది పోలీసు అధికారులను సేవారత్న అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో వినియోగదారుల సంఘం చైర్మన్ వేముల గౌరీశంకర్, ఎల్డర్స్ క్లబ్ వైస్ చైర్మన్ డాక్టర్ అవులప్ప, విశ్రాంత డీజీపీ గోపీనాథ్రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ మందాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.