సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగికి గుర్తింపు

ABN , First Publish Date - 2022-07-07T03:02:53+05:30 IST

చేసిన సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగికి గుర్తింపు లభిస్తుందని జడ్పీటీసీ పాలూరి మాల్యాద్రిరెడ్డి పేర్కొన్నారు. కలిగిరి పంచాయతీలో ఏడే

సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగికి గుర్తింపు
కార్యదర్శి మధును సన్మానిస్తున్న జడ్పీటీసీ మాల్యాద్రిరెడ్డి తదితరులు

కలిగిరి, జూలై 6: చేసిన సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగికి గుర్తింపు లభిస్తుందని జడ్పీటీసీ  పాలూరి మాల్యాద్రిరెడ్డి పేర్కొన్నారు. కలిగిరి పంచాయతీలో  ఏడేళ్లుగా అభివృద్ధికి పాటుపడి ప్రస్తుతం నాగసముద్రం కార్యదర్శిగా బదిలీపై వెళ్తున్న వెలుగోటి మధును పంచాయతీ, సచివాలయ సిబ్బంది బుధవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్‌వీ కళాధర్‌రావు, సర్పంచు రాగి దివ్య, ఉపసర్పంచు పాలూరు కొండారెడ్డి, వైసీపీ కన్వీనర్‌ కాటం రవీంద్రరెడ్డి, కార్యదర్శులు చెంచు క్రిష్ణయ్య, తేళ్ళ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T03:02:53+05:30 IST