యూపీలో Ambulance-Truck ఢీ: ఏడుగురి మృతి
ABN , First Publish Date - 2022-05-31T17:56:52+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో ఇంటికి వస్తుండగా ప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. అంబులెన్స్ ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారని పోలీసులు చెప్పారు. బాధితుల్లో పిల్భిత్కు చెందిన ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్న తర్వాత అంబులెన్స్లో ఢిల్లీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.అంబులెన్స్ మొదట రోడ్డు డివైడర్ను ఢీకొట్టి, ఆపై ట్రక్కును ఢీకొట్టింది. ఫలితంగా డ్రైవర్తో పాటు వాహనంలో ఉన్న మరో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు.
బాధితులందరినీ గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాత మృతదేహాలను పోస్ట్మార్టంకు పంపిస్తామని పోలీసులు తెలిపారు.మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.