Madhya Pradesh: బస్సు-డంపర్ ఢీ: ఏడుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-10-01T15:22:09+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు...

Madhya Pradesh: బస్సు-డంపర్ ఢీ: ఏడుగురి దుర్మరణం

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండ్ జిల్లాలో శుక్రవారం ఉదయం వేగంగా వస్తున్న బస్సు-డంపరును ఢీకొంది.ఈ  ప్రమాద ఘటనలో ఏడుగురు మరణించారు. గోహడ్ స్క్వేర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు.అధికారులు, స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-10-01T15:22:09+05:30 IST