మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం...బీజేపీ ఎమ్మెల్యే కుమారుడితో సహా ఏడుగురు వైద్య విద్యార్థుల మృతి

ABN , First Publish Date - 2022-01-25T15:20:56+05:30 IST

మహారాష్ట్రలో సోమవారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం...బీజేపీ ఎమ్మెల్యే కుమారుడితో సహా ఏడుగురు వైద్య విద్యార్థుల మృతి

ముంబై : మహారాష్ట్రలో సోమవారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్ధా రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడితో సహా ఏడుగురు వైద్యవిద్యార్ధులు మృతి చెందారు.బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు ఆవిష్కర్ తోపాటు ఏడుగురు వైద్య విద్యార్థులు సెల్సురా గుండా కారులో వెళుతుండగా ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. కారు సెల్సురా నుంచి అడవి గుండా వెళుతుండగా అకస్మాత్తుగా ఓ జంతువు కనిపించింది.జంతువును తప్పించేందుకు చక్రాన్ని తిప్పడంతో కారు కల్వర్టు కింద ఉన్న గుంతలో పడి పోయింది. ఈ ఘటనలో ఏడుగురు వైద్యవిద్యార్థులు మరణించారని వార్ధా ఎస్పీ ప్రశాంత్ హోల్కర్ చెప్పారు. మృతుల్లో తిరోరా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు ఆవిష్కర్ కూడా ఉన్నారు.ఇతర బాధితులను నీరజ్ చౌహాన్, నితేష్ సింగ్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్, పవన్ శక్తిగా గుర్తించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఏడుగురు వైద్యవిద్యార్థులు మరణించిన ఘటన వార్ధాలో విషాదాన్ని నింపింది. 


Updated Date - 2022-01-25T15:20:56+05:30 IST