అయ్యయ్యో.. పాపం.. నడిరోడ్డుపై చచ్చిపడి ఉన్న నెమళ్లు.. గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే..

ABN , First Publish Date - 2022-02-08T20:33:06+05:30 IST

ఆ గ్రామం పక్కనే నెమళ్లను ఉంచే ఎన్‌క్లోజర్ ఉంది.. ఆ నెమళ్లతో గ్రామస్థులకు మంచి అనుబంధం ఉంది..

అయ్యయ్యో.. పాపం.. నడిరోడ్డుపై చచ్చిపడి ఉన్న నెమళ్లు.. గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే..

ఆ గ్రామం పక్కనే నెమళ్లను ఉంచే ఎన్‌క్లోజర్ ఉంది.. ఆ నెమళ్లతో గ్రామస్థులకు మంచి అనుబంధం ఉంది.. అయితే ఈ రోజు (మంగళవారం) ఉదయం నడిరోడ్డుపై చచ్చిపడి ఉన్న నెమళ్లను చూసి గ్రామస్థులు విలవిలలాడారు.. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు అసలు విషయం బయటపెట్టారు.. 


రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌కు సమీపంలోని చైన్‌పుర గ్రామానికి సమీపంలో నెమళ్ల ఎన్‌క్లోజర్ ఉంది. మంగళవారం ఉదయం నడిరోడ్డుపై ఏడు నెమళ్లు చచ్చిపడి ఉన్నాయి. వాటి చుట్టూ కొన్ని గింజలు ఉన్నాయి. గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు.


నెమళ్లను చంపేందుకు ఎవరో విషపూరితమైన గింజలను లోపలికి విసిరారని, వాటిని తిని అవి చనిపోయాయని తేల్చారు. నెమళ్ల మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కాగా కొద్ది రోజులుగా నెమళ్లపై వేటగాళ్లు దాడులు చేస్తున్నారని, అటవీ అధికారులు ఇప్పటికైనా చుట్టు పక్కల ప్రాంతాల్లో సీసీటీవీ కెమేరాలు అమర్చాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2022-02-08T20:33:06+05:30 IST