West Bengalలో ఇళ్లకు నిప్పంటించిన దుండగులు...ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2022-03-22T18:21:33+05:30 IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజకీయ కక్షలు పెచ్చరిల్లాయి....

West Bengalలో ఇళ్లకు నిప్పంటించిన దుండగులు...ఏడుగురి మృతి

బీర్ భూమ్ : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజకీయ కక్షలు పెచ్చరిల్లాయి. బీర్ భూమ్ జిల్లాలో రాజకీయ హత్యకు ప్రతీకారంగా కొందరు దుండగులు మంగళవారం తెల్లవారుజామున ఐదు ఇళ్లకు బయటనుంచి తాళాలు వేసి నిప్పంటించారు.ఇళ్లను దహనం చేయడంతో పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాకు చెందిన ఏడుగురు మరణించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పంటించారని స్థానిక వర్గాలు తెలిపాయి. బీర్‌భూమ్‌లోని రాంపూర్‌హాట్‌లో టీఎంసీకి చెందిన పంచాయితీ నాయకుడు భాదు ప్రధాన్‌పై గుర్తు తెలియని దుండగులు బాంబులు వేశారు.


బీర్‌భూమ్‌లోని రాంపూర్‌హాట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుల బృందం ఐదు ఇళ్లకు తాళాలు వేసి నిప్పంటించారు.ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలానికి బీర్భూమ్ జిల్లా మేజిస్ట్రేట్, అగ్నిమాపక అధికారులు, స్థానిక పోలీసులు చేరుకున్నారు.


Updated Date - 2022-03-22T18:21:33+05:30 IST