పలు ప్రత్యేక రైళ్లు రద్దు
ABN , First Publish Date - 2021-05-07T05:24:47+05:30 IST
కొవిడ్ వైరస్ వ్యాప్తితో తగిన ఆక్యుపెన్సీ లేని కారణంగా పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం, మే 6: కొవిడ్ వైరస్ వ్యాప్తితో తగిన ఆక్యుపెన్సీ లేని కారణంగా పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. విశాఖ నుంచి కిరోండోల్ వెళ్లే 08516 నంబరు గల రైలు ఈ నెల ఏడు నుంచి 21వ తేదీ వరకు...కిరండోల్ నుంచి విశాఖ వచ్చే 08515 నంబరు గల రైలు ఈ నెల ఎనిమిది నుంచి 22 వరకు రద్దు చేశారు.భువనేశ్వర్ నుంచి జగదల్పూర్ వెళ్లే 08445 నంబరు గల రైలు ఈ నెల ఎనిమిది నుంచి 22వ తేదీ వరకు...జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్లే 08446 నంబరు గల రైలు ఈ నెల తొమ్మిది నుంచి 23 వరకు రద్దు చేశారు. తిరుపతి నుంచి విశాఖ వచ్చే 02708 నంబరు గల డబుల్ డెక్కర్ రైలు ఈనెల ఏడు నుంచి 30వ తేదీ వరకు....విశాఖ నుంచి తిరుపతి వెళ్లే 02707 నంబరు గల డబుల్ డెక్కర్ రైలు ఈ నెల ఎనిమిది నుంచి 31 వరకు రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ వచ్చే 02784 నంబరు గల రైలు ఈ నెల ఎనిమిది నుంచి 29వ తేదీ వరకు....విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే 02783 రైలు ఈ నెల తొమ్మిది నుంచి 30 వరకు రద్దు చేశారు. విశాఖ, రాయపూర్ మధ్య రాకపోకలు సాగిస్తున్న 08528, 08527 నంబరు గల రైళ్లు ఈ నెల 8, 9, 15, 16 తేదీల్లో రద్దు చేశారు. సంబల్పూర్, రాయగడ మధ్య నడుస్తున్న 08301, 08302 నంబరు గల రైళ్లు ఈ నెల 8, 9, 15, 16 తేదీల్లో రద్దు చేశారు.