వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం
ABN , First Publish Date - 2021-02-26T05:09:26+05:30 IST
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్బాష ఆరోపించారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్బాష
రాయచోటి, ఫిబ్రవరి 25: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్బాష ఆరోపించారు. గురువారం ఆయన స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్పొరేషన్ల డైరెక్టర్లు, చైర్మన్లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్నారు. కార్పొరేషన్లకు ఇవ్వాల్సిన నిధులన్నీ ప్రభుత్వం దారి మళ్ళిస్తుంటే.. చూస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదన్నారు. జిల్లా తెలుగుయువత కార్యదర్శి పాత రాయచోటి సాయి, రామాపురం మండల నేత హకీమ్, టీడీపీ నేతలు రామాంజనేయులు, మాసాపేట పీర్సాబ్, తదితరులు పాల్గొన్నారు.