అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష
ABN , First Publish Date - 2021-10-27T05:06:51+05:30 IST
మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం, కోర్టులు చెబుతున్నా పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు పద్మ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాతంత్ర మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ
గుంటూరు(విద్య), అక్టోబరు 26: మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం, కోర్టులు చెబుతున్నా పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని మాస్టర్మైండ్స్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థినుల కన్వెన్షనలో ఆమె మాట్లాడారు. మహిళలపై అన్ని రంగాల్లో వివక్షత కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మనోజ్కుమార్, కాకుమాను శ్రావ్య ప్రసంగించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా బాలికల కమిటీ కన్వీనర్గా ఎస్కే నాగూర్బి, కో కన్వీనర్గా శ్రావ్య, చరిత, సౌమ్య, సమీజ, సునీత, నవిత, భవాని తదితరుల్ని ఎన్నుకున్నట్లు ప్రటించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షులు ఎం.కిరణ్, నగర అధ్యక్ష, కార్యదర్శులు పూర్ణమహేష్, కిరణ్కబీర్, సందీప్, సమీర్, సుధీర్ పాల్గొన్నారు.