నిధులే లేకుండా కొత్త మంత్రులు ఎందుకు?: శైలజానాథ్
ABN , First Publish Date - 2022-04-16T20:46:43+05:30 IST
నిధులే లేకుండా కొత్త మంత్రులు ఎందుకు?: శైలజానాథ్
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. జగన్రెడ్డి వీర బాదుడురెడ్డిగా మారారని శైలజానాథ్ అన్నారు. పాదయాత్రలో పేదలపై ముద్దులు కురిపించిన జగన్రెడ్డి.. ఇప్పుడు పన్నులతో పిడిగుద్దులు కురిపిస్తున్నారని శైలజానాథ్ ఆరోపించారు. అప్పులతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని, నిధులే లేకుండా కొత్త మంత్రులు ఎందుకో?: అని సాకే శైలజానాథ్ అన్నారు.