ముగిసిన శాకంబరి ఉత్సవం

ABN , First Publish Date - 2021-07-25T06:02:12+05:30 IST

ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న శాకంబరీదేవి ఉత్సవాలు శనివారం ముగిశాయి.

ముగిసిన శాకంబరి ఉత్సవం

చివరి రోజు భారీసంఖ్యలో తరలివచ్చిన భక్తులు

విజయవాడ, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న శాకంబరీదేవి ఉత్సవాలు శనివారం ముగిశాయి. ఉదయం 11 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి, కూష్మాండ బలి, మార్జనం, కలశోద్వాసన, ఆశీర్వాద కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు. శనివారం వర్షం లేకపోవడం, గురుపౌర్ణిమ కూడా కావడంతో శాకంబరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావులు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-07-25T06:02:12+05:30 IST