కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: గడ్డం శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2022-08-19T05:29:10+05:30 IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: గడ్డం శ్రీనివాస్‌
సమావేశంలో మాట్లాడుతున్న గడ్డం శ్రీనివాస్‌

మెదక్‌ అర్బన్‌, ఆగస్టు 18: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలే బీజేపీని గెలిపిస్తాయన్నారు. ఏ ఎన్నిక వచ్చిన గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని చాటి చెప్పడానికి మునుగోడు ఉపఎన్నిక రూపంలో ప్రజలకు మంచి అవకాశం వచ్చిందన్నారు. 21న అమిత్‌షా సభకు జిల్లా నుంచి భారీగా తరలిరావాలని పిలపునిచ్చారు. జిల్లా ఇన్‌చార్జి మల్లారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అరాచకపు పాలన, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కిరణ్‌, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్‌, జిల్లా నాయకులు మధు, జనార్ధన్‌, ప్రభాకర్‌రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:29:10+05:30 IST